వికలాంగులపట్ల జాలి వద్దు, అవకాశాలు కల్పించాలి: సిఎం కిరణ్

Kiran Kumar Reddy
హైదరాబాద్: వికలాంగులపట్ల ఉండాల్సింది జాలి కాదని, వారికి అవకాశాలు కల్పించాలని శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. డిసెంబర్ 3 అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం కారణంగా ఆయన వికలాంగులను ఉద్దేశించి హరిహర కళాభవన్ లో ప్రసంగించారు. వికలాంగులకు అవకాశం కలిగించే వారు చదువుకునేందుకు ప్రభుత్వం, ప్రయివేటు రంగం వారు కృషి చేయాలన్నారు. వికలాంగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుదన్నారు. అంధుల సంక్షేమం కోసం మరిన్ని ఎక్కువ నిధులు మంజూరు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. వికలాంగులు నా కార్యాలయానికి ఎప్పుడైనా రావచ్చునని చెప్పారు.

సచివాలయానికి వచ్చిన వికలాంగులు పై ఫ్లోర్ వరకు రావడానికి ఇబ్బందులు ఉన్న కారణంగా వారి కోసం క్రిందనే పిటీషన్లు తీసుకునే ఏర్పాటు చేస్తానన్నారు. నేను రాజకీయాల్లోకి వచ్చిన ఈ 20 సంవత్సరాలుగా నా వద్దకు వికలాంగులు తమ సమస్యలు పరిష్కరించాల్సిందిగా వస్తుంటారన్నారు. వికలాగులుగా పుట్టడానికి మేనరికం, ప్రసవం సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడమే ముఖ్య కారణాలు అని ముఖ్యమంత్రి చెప్పారు. గ్రామీణులను మేనరికం పెళ్లిల్లు చేసుకోకుండా చైతన్యపరిచే విధంగా కార్యాచరణ రూపొందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వికలాంగుల పింఛన్లకోసం దేశంలోని ఏ ప్రభుత్వం ఇంత బడ్జెట్ కేటాయించడం లేదన్నారు. వికలాంగులకు స్టడీ సర్కిల్స్ లో ప్రత్యేక రాయితీ కల్పించే చర్యలు తీసుకుంటామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+