ఫైళ్లపై తొలి సంతకాలతో సచివాలయంలో మంత్రులు బిజీ

గనుల శాఖ మంత్రిగా గల్లా అరుణకుమారి కూడా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. నల్గొండ జిల్లా గుండ్లపల్లి గ్రామంలో ఎన్సీఎల్ సంస్థకు సున్నంరాయి లీజు పొడిగింపు, అనంతపురం జిల్లా తుమ్మల గ్రామంలో క్వార్ట్స్ లీజు పొడిగింపు ఫైళ్లపై మంత్రి సంతకాలు చేశారు. అటవీ శాఖ మంత్రిగా శత్రుచర్ల విజయరామరాజు సచివాలయం డీబ్లాక్లో శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. డిసెంబరుతో గడువు ముగిసిన 471 మంది గ్రామీణ అటవీ అధికారులను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఫైలుపై ఆయన తొలి సంతకం చేశారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన 25 లక్షల ఎకరాల్లో రూ. 12 వేల కోట్ల ఉపాధిహామీ పనులు చేపట్టే ఫైలుపై ఆయన తొలి సంతకం చేశారు.
సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి డీకే అరుణ శుక్రవారం సచివాలయంలోని డీ బ్లాకులో పదవీ బాధ్యతలు చేపట్టారు. వృద్ధాప్యంతో విధి నిర్వహణకు దూరమైన జర్నలిస్టులకు వెయ్యి రూపాయల చొప్పున పెన్షన్ అందించే ఫైలుపై ఆమె తొలిసంతకం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థికసాయం చేసే మరో ఫైలుపై ఆమె రెండో సంతకం చేశారు. ఇక నుంచి తెలుగు రచనలో ప్రతిభ కనబరిచే వారికి నంది అవార్డులు అందజేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications