పెళ్లికి అంగీకరించలేదని నిప్పంటించాడు: వివాహేతర సంబంధమే కారణం

మైదుగోలానికి చెందిన భారతి అనే వివాహిత మనస్పర్థల కారణంగా గత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో ఆమెకు వెంకటప్ప అనే వ్యక్తితో పరిచయం అయ్యింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసినట్లు తెలుస్తోంది. కాగా వెంకటప్ప భారతిని పెళ్లి చేసుకుంటానని చెప్పటంతో ఆమె అంగీకరించలేదు. భారతికి వెంకటప్పతో కాకుండా మరో వ్యక్తితో కూడా వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలిసిన వెంకటప్ప తనతో పెళ్లికి సైతం ఒప్పుకోక పోవటంతో ఆగ్రహించి ఉదయం ఆమెపై కిరోసిన పోసి నిప్పంటించాడు. ఉదయం వారిద్దరికి మధ్య వాగ్వాదం కూడా జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications