పులివెందులలో పాగాకు అప్పుడే వైయస్ వివేకానంద ప్రయత్నాలు

YS Vivekananda Reddy
కడప: శాసనమండలి సభ్యుడు, దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైయస్ వివేకానంద కడపలోని తన బంధువుల ఇళ్లకు వెళ్లి తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన వైయస్ జగన్ కు, వైయస్ వివేకానందకు రాజకీయంగా విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే. తండ్రి హయాంలో పార్టీ పేరు, ప్రభుత్వం పేరు చెప్పుకొని కోట్లాది రూపాయలు సంపాదించుకున్న జగన్ త్వరలో కొత్త పార్టీ పెడతానని వార్తలు వస్తున్న నేపథ్యంలో జగన్ చిన్నాన్న వివేకానంద మాత్రం తనకు ఓ గుర్తింపు తీసుకు వచ్చిన కాంగ్రెస్ లో ఉంటానని ప్రకటించాడు.

జగన్ కడప పార్లమెంటు సభ్యత్వానికి, దివంగత వైయస్ సతీమణి విజయలక్ష్మి పులివెందుల నియోజగవర్గానికి రాజీనామా చేసినందన అక్కడ ఉప ఎన్నికల నేపథ్యంలో వివేకా ముందుగానే తన ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన కడపకు వెళ్లి తమ బంధువులను మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఆ తర్వాత ఆయన కడప జెఎన్టీయులో ఉన్న దివంగత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ విగ్రహానికి, కడప బస్టాండ్ లో ఉన్న దివంగత వైయస్, ఇందిరాగాంధీల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

వివేకా జిల్లా అధికారులతో కూడా భేటీ కానున్నారు. ఇంతకుముందు పులివెందుల నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహించినందున వివేకాకు గట్టి పట్టు ఉంది. అంతేకాకుండా 1991లో వైయస్ రాజశేఖరరెడ్డికి మద్దతుగా తన శాసనసభ్యత్వానికి సైతం రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. వివేకాను నియోజకవర్గంలో గట్టి పట్టుతోపాటు మంచి పేరు ఉంది. పార్టీ ఆదేశిస్తే పులివెందులనుండి పోటీ చేయడానికి కూడా సిద్ధమని వివేకా ఇప్పటికే ప్రకటించారు. జగన్ సైతం రాష్ట్ర రాజకీయాల్లో ఉండటానికి పులివెందులనుండి పోటీ చేయడమనేది తథ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+