హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హోంమంత్రి సబితారెడ్డి తరుచూ ప్రయాణించే దారిలో పేలుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: రాజధానిలోని రాజేంద్రనగర్ లో ఓ పేలుడు సంభవించింది. హోంమంత్రి సబితారెడ్డి తరుచూగా ప్రయాణించే రహదారిలో ఈ పేలుడు సంభవించడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాజేంద్రనగర్ గాయత్రీనగర్ రహదారి మధ్యలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. గతంలో చేవెళ్ల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన సబితారెడ్డి, ఈసారి మహేశ్వరం నియోజకవర్గం నుండి విజయం సాధించింది. ఆమె తరుచూగా గాయత్రీ నగర్ రహదారి వెంట వెళుతుంటారు.

దీంతో మావోయిస్టులు సబితారెడ్డి లక్ష్యంగా ఏమైనా పేలుడు పదార్థాలు పెట్టి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేలుడు సంభవించిన ప్రాంతంలో కొన్ని వైర్లను కూడా కనుగొన్నారు. మరో రెండుమూడు రోజుల వరకు సబితారెడ్డికి ఎలాంటి పనులు లేకపోవటంతో ఆ రహదారిలో వెళ్లే అవకాశాలు లేవు. సోమవారం మాత్రం రాజేంద్రనగర్ కు వెళ్లవలసి ఉండె, కొన్ని కారణాల వల్ల వెళ్లలేదు. పేలుడు సంభవించిన చాలా సేపటికి పోలీసులు అక్కడకు చేరుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X