విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరద తాకిడి ప్రాంతాల రైతులకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ భరోసా

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
విజయవాడ: వరద తాకిడి ప్రాంతాల రైతులకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన చెప్పారు. వరద తాకిడి ప్రాంతాల్లో ఆయన గురువారం పర్యటించారు. కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో వరద బాధితులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇప్పటికి ఐదు సార్లు అధిక వర్షం పాతం నమోదైందని, దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన చెప్పారు. ఆత్మస్థైర్యం కోల్పోవద్దని ఆయన రైతులకు సూచించారు.

కౌలు రైతులకు కూడా నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన చెప్పారు. రాష్టంలో 467 మండలాలను వరద తాకిడికి ప్రాంతాలుగా గుర్తించామని, ఈ మండలాల్లోని బాధితులను ఆదుకుంటామని ఆయన చెప్పారు. వరద తాకిడి ప్రాంతాల్లో రైతుల రుణాలను రీషెడ్యూల్ చేసి కొత్తగా రుణాలు ఇవ్వాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. రబీకి ఇన్ పుట్స్ అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X