హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్పీకరుగా నాదెండ్ల, ప్రభుత్వ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nadendla Manohar
హైదరాబాద్: శుక్రవారం నుండి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నందున శాసనసభాపతి, ఉపసభాపతిలపై అందరి దృష్టి పడింది. సామాజిక సమీకరణలు, ప్రాంతీయ సమీకరణాలు, జగన్ సమస్య కారణంగా సభాపతి, పిసిసి అధ్యక్షుడు, చీప్ విప్ పదవులు పెండింగ్ లో పడతాయనే మాటలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఉపసభాపతి నాదెండ్ల మనోహరే శాసనసభను నిర్వహిస్తారన్నారు. అయితే సభాపతి ఎంపికకు శుక్రవారం ప్రకటన వెలువడనుంది.

ఇప్పటి వరకు శాసనసభ ఉపసభాపతిగా ఉన్న నాదెండ్ల మనోహర్ కు ప్రమోషన్ ఇస్తూ ఆయనను సభాపతి స్థానంలో కూర్చుండబెడతారని తెలుస్తోంది. అలాగే ఉపసభాపతిగా ఎస్సీ వర్గానికి చెందిన భట్టి విక్రమార్కను, ప్రభుత్వ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా పిసిసి అధ్యక్షుడి పదవి ఖరారు కావడానికి మరికొంత సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X