మందకృష్ణ దీక్ష విరమించి చర్చలకు వస్తే ఢిల్లీకి అఖిలపక్షం: పితాని

Pitani Satyanarayana
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పితాని సత్యనారాయణ శుక్రవారం చెప్పారు. మందకృష్ణ తన నిరాహార దీక్షను విరమించుకుంటే ప్రభుత్వం ఆయనతో చర్చలకు సిద్దమని ప్రకటించారు. అఖిలపక్షాన్ని జనవరి 31లోగా ఢిల్లీ తీసుకు వెళతామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాగా అంతకుముందు కొందరు మాదిగ వర్గానికి చెందిన నాయకులు ముఖ్యమంత్రిని కలిశారు. మందకృష్ణ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తున్నందున అఖిలపక్షానికి ఒప్పుకోవాలని కోరారు.

కాగా ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం ధ్వజమెత్తారు. పార్టీలన్నీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిన తర్వాత కూడా వర్గీకరణపై ప్రభుత్పం ఎందుకు ఇంతగా దానిని నాన్చుతుందో తెలియజేయాలన్నారు. అఖిలపక్షాన్ని ప్రభుత్వం వెంటనే ఢిల్లీకి తీసుకు వెళ్లాలని ఆయన డిమాండు చేశారు. వర్గీకరణపై ప్రభుత్వం నిర్లిప్తంగా ఉంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి ఉంటుందన్నారు. మందకృష్ణ ఆరోగ్యం క్షీణిస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. తెలుగుదేశం పార్టీ వర్గీకరణకు అనుకూలంగా ఉందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+