మందకృష్ణ మాదిగ ఆమరణ నిరాహార దీక్ష విరమణ

అంతకు ముందు అసెంబ్లీ ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రులు పితాని, దామోదర రాజనర్సింహ, డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ, ఎస్సీల వర్గీకరణకు సంబంధించి జనవరి 31లోగా అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లనున్నట్టు ప్రకటించారు. వీలైతే అంతకన్నా ముందుగానే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని సీఎం చెప్పారన్నారు. ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో దీక్ష విరమించాల్సిందిగా మంద కృష్ణమాదిగకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రకటనతో గాంధీ ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్న కృష్ణమాదిగ దీక్ష విరమించారు. ఆయనకు మంత్రులు పితాని సత్యనారాయణ, శైలజానాథ్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం మంద కృష్ణ మాట్లాడుతూ, కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డికి వర్గీకరణ విషయమై కొంత సమయం కేటాయించాల్సి ఉన్నందున దీక్ష విరమిస్తున్నానన్నారు.
మంద కృష్ణ దీక్షలకు మద్దతుగా ఇక్కడి ఎల్బీ నగర్లో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు చేపట్టిన దీక్షా శిబిరం వద్ద శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వ నిర్లాక్ష్యాన్ని నిరసిస్తూ ఇద్దరు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిని పోలీసులు వారించారు.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications