పేర్ని నాని వ్యవహారంపై లడగపాటి రాజగోపాల్ తో కిరణ్ చర్చలు

కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసిన వెంటనే లగడపాటి రాజగోపాల్ హైదరాబాద్ వచ్చారు. తాను కిరణ్ కుమార్ రెడ్డిని కలవడానికి రాలేదని, చెన్నైకి పెళ్లికి వెళ్తూ ఇక్కడ ఆగానని రాజగోపాల్ చెప్పారు. అయితే అసలు విషయం మాత్రం కృష్ణా జిల్లా రాజకీయాల గురించేనని తెలుస్తోంది. తనకు మంత్రి పదవి రాకపోవడంతో పేర్ని నాని తీవ్ర ఆసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. పైగా, ఇటీవలి కృష్ణా జిల్లా పర్యనటలో కిరణ్ కుమార్ రెడ్డి కనీసం నానిని పలకరించలేదని తెలుస్తోంది. దీనికి ఆయన తీవ్రంగా కలత చెందినట్లు భావిస్తున్నారు. దీంతోనే తాను వైయస్ జగన్ వెంట ఉంటానని ప్రకటించినట్లు చెబుతున్నారు. నాని పార్టీతోనే ఉంటారని కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి పార్థసారధి చెబుతున్నారు.












Click it and Unblock the Notifications