వైయస్ జగన్ కు సై అన్న మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు

Jakkampudi Rammohan Rao
రాజమండ్రి:తూర్ప గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెసు నాయకుడు, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు, ఆయన భార్య విజయలక్ష్మి మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైయస్ జగన్ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నారు. బుధవారం వారు కడియం చేరుకున్న జగన్ సమక్షంలోనే కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. జగన్ ను చూడటానికి భారీగా జనాలు తరలి వచ్చారు. వారందరి సాక్షిగా జక్కంపూడి జగన్ వెంట వెళ్లేందుకు నిశ్చయించుకున్నారు.

ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడారు. రాజశేఖర రెడ్డి మరణం తరువాత రాష్ట్రంలో తీవ్ర అనిశ్చితి ఏర్పడిందన్నారు. రంగులు మార్చే ఊసరవెల్లులు పార్టీకి కావాలని కాంగ్రెసు అభిప్రాయ పడుతుందని కాని అలాంటి వారి అవసరం లేదని పార్టీ తెలుసుకోవాలన్నారు. జగన్ ఒక్కడే రాష్ట్రాన్ని సంక్షోభం నుండి గట్టెక్కించగలడని అన్నారు. ఇపుడు జక్కంపూడి రాజీనామాతో జిల్లాలో కాంగ్రెసు పార్టీలో కీలక నేత దూరమవు తున్నారు.

అనారోగ్యంతో మూడేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నా ఆయన కుటుంబం కాంగ్రెసు పార్టీలో క్రియాశీల పాత్రపోషిస్తోంది. జక్కంపూడి రాజకీయ వారసులుగా ఆయన భార్య విజయలక్ష్మి, తనయుడు రాజా ఇప్పటికే జగన్ వర్గంలో కీలకంగా ఉన్నారు. జక్కంపూడి రాజీ నామా తర్వాత కాంగ్రెసు పార్టీలో ఉన్న మరికొంతమంది జక్కంపూడి అనుచరులు కూడా ఈయన బాట లోనే నడిచేందుకు సిద్దమవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+