వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని తొలి సంతకం చేశా: కన్నబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
విశాఖపట్టణం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం అనంతరం మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని తానే మొదటి సంతకం పెట్టానని విశాఖ జిల్లా యలమంచిలి శాసనసభ్యుడు కన్నబాబు(ఉప్పలపాటి వెంకటరమణరాజు) అన్నారు. జిల్లాలో జగన్ చేపట్టే ఓదార్పులో పాల్గొనని ఆయన స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం తన అనుచరవర్గంతో సమావేశమయ్యారు.

యలమంచిలిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఆవిష్కరింప చేస్తామన్నారు. ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతానని చెప్పారు. కాంగ్రెస్ లో ఉండాలా, జగన్ వైపు వెళ్లాలా అనే విషయాన్ని కార్యకర్తలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటునన్నారు. తన కార్యకర్తల కోరిక మేరకే నడుచుకుంటానని చెప్పారు. కార్యకర్తలు కోరితే రాజీనామాకు సిద్ధమన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X