మూకుమ్మడి రాజీనామాల దిశగా టిడిపి శాసనసభ్యులు?

Telugudesam
హైదరాబాద్‌: రైతు సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో రాజీనామాలు చేసే తీవ్ర చర్యలకు దిగాలని వారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వెంటనే రాజధాని నగరానికి చేరుకోవాల్సిందిగా పార్టీ శాసనసభ్యులకు పార్టీ నాయకత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. దీనిపై చర్చించేందుకు బుధవారం సాయంత్రం ఐదు గంటలకు తెలుగుదేశం పోలిట్ బ్యూరో సమావేశం జరుగుతోంది.

గురువారం తెలుగుదేశం శాసనసభ్యులు మూకుమ్మడిగా స్పీకర్ కార్యాలయంలో తమ రాజీనామాలు సమర్పించే అవకాశం ఉంది. రైతులను ఆకట్టుకోవడానికి అంతకు మించి కార్యక్రమం లేదని తెలుగుదేశం నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రేపు గురువారం ఉదయం టిడిఎల్పీ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశం తర్వాత వారు రాజీనామాలు చేస్తారని అంటున్నారు. దాంతో చంద్రబాబు దీక్ష విరమిస్తారని అంటున్నారు. రాజీనామాల అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంటిని ముట్టడించాలని కూడా తెలుగుదేశం నాయకులు ఆలోచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+