ఐసియులోకి మారేందుకు నిరాకరించిన చంద్రబాబు

కాగా, చంద్రబాబు గదినే ఐసియుగా మార్చేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు గదిలో రెండు ఇసిజి మిషన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఓ హార్ట్ మానిటరింగ్ సిస్టమ్ ను కూడా గదిలో పెడుతున్నారు. చంద్రబాబుకు ఏమైనా అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి హెచ్చరించారు.
రైతు సమస్యలపై దీక్ష చేపట్టిన చంద్రబాబుకు ఏదైనా జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలుగుదేశం నేత ఎర్రన్నాయుడు హెచ్చరించారు. రాష్ట్రంలో రైతులు కన్నీళ్లు పెడుతుంటే ఎంపీలు స్వార్థం కోసం ఢిల్లీలో ఉన్నారని విమర్శించారు. రైతుల దగ్గరకు వెళ్లేందుకు ప్రభుత్వం గజగజ వణుకుతోందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలకు రైతు సమస్యలపై చిత్తశుద్ధి లేదని మరో నేత నాగం జనార్థన్ రెడ్డి అన్నారు.
చంద్రబాబు ఆరోగ్యం ప్రతి నిమిషానికి క్షీణిస్తోందని వైద్యులు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని తెలుగుదేశం సీనియర్ నేత తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. ప్రజా శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని బాబుతో దీక్ష విరమింపజేసేందుకు ముఖ్య నేతలు, కుటుంబసభ్యులు ప్రయత్నించాలని కోరారు. ప్రభుత్వాన్ని నమ్ముకుంటే తమ అధినేత ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదముందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications