మీరు ఊహించినట్లు జరగదు: జగన్ పై మీడియా వ్యాఖ్యలకు డిఎస్ స్పందన

D Srinivas
హైదరాబాద్: మీరు ఊహించినట్లు ఏమీ జరగదని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు డి శ్రీనివాస్ మీడియా ప్రతినిధులనుద్దేశించి బుధవారం వ్యాఖ్యానించారు. ప్రభుత్వం పడిపోతుందన్న మీడియా వ్యాఖ్యలపై ఆయన పరోక్షంగా స్పందించారు. జగన్ దీక్షలో పాల్గొన్న శాసనసభ్యులపై సైతం డిఎస్ మాట్లాడటానికి నిరాకరించారు. ప్రభుత్వం దృష్టిని ఆకర్షించడానికి ఆమరణ నిరాహార దీక్షవంటి కఠిన నిర్ణయాలు తీసుకోకుడదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు దీక్ష విరమించుకోవాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు.

రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆయన తన దీక్షను విరమించుకోవాలని ఆయన కోరారు. రైతులకు ప్రభుత్వం సాధ్యమైనంత సాయం అందించిందని, మరింత అందించడానికి కృషి చేస్తుందన్నారు. చంద్రబాబు నాయుడు దీక్ష విరమించి ప్రభుత్వంతో రైతుల సమస్యలపై చర్చించి తగు సూచనలు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. రైతు సమస్యలపై చంద్రబాబు ఉద్దేశ్యం ఏంటో ప్రజలకు, ప్రభుత్వానికి అర్థమయిందన్నారు. చంద్రబాబు సేవలు రాష్ట్రానికి అవసరం అన్నారు. తొమ్మిది ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రాణాలు రాష్ట్రానికి, దేశానికి చాలా అవసరం అన్నారు. సమస్యలు చెప్పటంలో తప్పులేదు. కానీ నిరాహార దీక్ష అనేది సరికాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+