చంద్రబాబు దీక్ష విరమణకు చొరవ చూపండి: జయప్రకాష్

Jayaprakash Narayana
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి దీక్షను విరమింపజేయడానికి చొరవ చూపాలని, బేషిజాలకు పోవద్దని లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబునాయిడిని ఆయన బుధవారం సాయంత్రం పరామర్శించారు. గంట గంటకూ నీళ్లు తీసుకుంటుండడం వల్ల చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని, అయితే, విషమించే ప్రమాదం ఉందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకుంటామని అన్ని పార్టీలు కలిసి రైతులకు విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రైతులు మనోధైర్యం కోల్పోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

రైతు సమస్యలు ఈ నెల 7, 8 తేదీల్లో తలెత్తినవి కావని, ప్రభుత్వాలు దూరదృష్టితో వ్యవహరించకుండా ఉత్పత్తులకు ధరలు తగ్గిస్తూ రావడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బ తిన్నదని ఆయన అన్నారు. గ్రామీణ ఆదాయం తగ్గి సంక్షోభంలో పడిందని ఆయన అన్నారు. పార్టీలకు అతీతంగా రైతులను ఆదుకోవడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. రైతు సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేయాల్సిందేనని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+