శ్రీకృష్ణ నివేదిక అనుకూలంగా లేకపోతే నిరాహార దీక్ష: కెసిఆర్

సమైక్యాంధ్రలో తెలంగాణకు న్యాయం జరగదని ఆయన అన్నారు. తెలంగాణ కాంగ్రెసు నాయకులు చవటలు, దద్దమ్మలు అని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చిన తెలంగాణ కాంగ్రెసు తెలంగాణ నాయకుల వల్లనే వెనక్కి పోయిందని ఆయన విమర్సించారు. తెలంగాణకు నీళ్లు, ఉద్యోగాల్లో జరుగుతున్న అన్యాయంపై, విద్యార్థులపై పెట్టిన కేసులపై కాంగ్రెసు తెలంగాణ నాయకులు స్పందించడం లేదని, విద్యార్థుల శవాలపై శపథాలు చేసిన వారు రాజీనామాలు చేయకుండా తప్పుకున్నారని, వారిని చవటలు, దద్దమ్మలు అనకపోతే ఏమంటామని ఆయన అన్నారు. తాము ఎవరిదీ అడగడం లేదని, తమ తెలంగాణ తమకు కావాలంటున్నామని, సీమాంధ్ర నాయకులు తమది తమకే ఇతరులదీ తమకే కావాలంటున్నారని ఆయన అన్నారు. తాను నిరాహార దీక్ష చేసినప్పుడు ఊళ్లు ఉద్యమాలకు వేదికలయ్యాయని, విశ్వవిద్యాలయాలు యుద్ధభూములయ్యాయని, దాంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తన్నట్లు కేంద్రం ప్రకటించిందని, వచ్చిన తెలంగాణ సీమాంధ్ర నాయకుల వల్ల వెనక్కి పోయిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications