ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి నిరాహార దీక్షల తలనొప్పి

రాజకీయంగా తన ప్రభుత్వం ఏ మేరకు అస్థిరం పాలవుతుందనే ఆలోచన కూడా ఆయనను సతమతం చేస్తోంది. ఎఐసిసి ప్లీనరీ సమావేశంలో పాల్గొని మంగళవారం హైదరాబాదు వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి రోజంతా చంద్రబాబు దీక్షను ఎలా విరమింపజేయాలనే విషయంపైనే సమాలోచనలు జరిపారు. ఆయన చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. చంద్రబాబు దీక్ష విరమించడానికి నిరాకరించారు. వైయస్ జగన్ 48 గంటల పాటే దీక్ష చేస్తున్నారు కాబట్టి అది పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ వైయస్ జగన్ బలప్రదర్శనకు దాన్ని వాడుకుంటున్నారు. ఎంత మంది కాంగ్రెసు శాసనసభ్యులు వైయస్ జగన్ వైపు వెళ్తారనే సంశయం ఆయనను పీడిస్తూనే ఉంది. వైయస్ జగన్ కు మద్దతు తెలుపుతున్న శాసనసభ్యులను ఎలా కట్టడి చేయాలనేది ఆయనకు పాలుపోవడం లేదు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అంతగా ఆందోళనల సమస్యలు లేవు. కిరణ్ కుమార్ రెడ్డి సత్తా తెలుసు కాబట్టే చంద్రబాబు, వైయస్ జగన్ అంతకన్నా తీవ్ర ఒత్తిడి పెడుతున్నారు. ఏమైనా, కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ముళ్ల కిరీటంలాంటిదే.












Click it and Unblock the Notifications