చంద్రబాబుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్

తాము రైతులకు 2004 నుంచి 2010 వరకు 8 వేల కోట్ల రూపాయలు అందించామని, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తొమ్మిదేళ్లు 33 కోట్ల రూపాయలే అందించారని, అలా చూస్తే రైతుల పక్షపాతి కాంగ్రెసు పార్టీయా, తెలుగుదేశమా అని ఆయన అన్నారు. తమది జాలి గుండె అని, రైతులను ఆదుకోవడానికి తాము ముందుంటామని ఆయన చెప్పారు. రైతులకు వీలైతే ఇంత కన్నా ఎక్కువ ఇవ్వడానికి తాను ఇవ్వడానికి సిద్దంగా ఉన్నానని, అయితే పరిస్థితి అనుకూలంగా లేదని ఆయన అన్నారు. ప్రజల దృష్టిని ఆకర్షించడానికి, తాను రైతు బాంధవుడిని అని చాటుకోవడానికి చంద్రబాబు దీక్ష చేపట్టారని, ఆ లక్ష్యసాధనలో చంద్రబాబు విజయం సాధించారని, అందువల్ల దీక్ష విరమించాలని ఆయన అన్నారు.
చంద్రబాబు హయాంలో వైయస్ తో పాటు 11 మందిమి నిరాహార దీక్ష చేస్తే పలకరించినవారు లేరని, చంద్రబాబు దీక్ష చేపట్టిన వెంటనే తాను ఢిల్లీ నుంచి వచ్చి చంద్రబాబును ఫోన్ లో పలకరించానని, చంద్రబాబు వద్దకు మంత్రులను పంపించామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications