చంద్రబాబుకు చిరంజీవి అండ: దీక్ష విరమింప చేయాలని సిఎంకు ఫోన్

చంద్రబాబు దీక్ష చేపట్టిన సమయంలో అధికారం కోసమే ఆయన దీక్ష అంటూ ధ్వజమెత్తిన చిరంజీవి ఆరు రోజుల అనంతరం ఆయన దీక్షకు మద్దతు పలికారు. రైతు సమస్యలపై 48 గంటన నిరాహార దీక్ష చేస్తున్న మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్ ను ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు పరామర్శించడం పార్టీ విప్ ను ధిక్కరించడం కిందకు రాదని ఆ పార్టీ నాయకులు రాంచందర్ రావు అన్నారు. ఇతర పార్టీ నేతలను జగన్ ఆహ్వానించటం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
కాగా అనంతపురం జిల్లా కాంగ్రెస్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి కూడా చంద్రబాబును పరామర్శించారు. అయితే జేసి ప్రభుత్వం తరఫున కలిశారా, లేదా వ్యక్తిగతంగా కలిశారా అనేది తెలియడం లేదు. జెసి నిమ్స్ లోనికి వెళ్లే సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు. కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అయితే పోలీసులు వారిని అడ్డుకొని జెసిని లోనికి పంపించారు.












Click it and Unblock the Notifications