వైయస్ జగన్ దీక్షకు హాజరైన కాంగ్రెసు ఎంపి సబ్బం హరి

తమకు ఎవరినీ బ్లాక్ మొయిల్ చేయాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. రైతు సమస్యలపై ప్రధాని మన్మోహన్ సింగ్ ను ఢిల్లీలో మంగళవారం కలిసిన పార్లమెంటు సభ్యుల్లో తాను కూడా ఉన్నానని, వినతిపత్ర రూపకల్పనలో తాను కూడా పాలు పంచుకున్నానని ఆయన చెప్పారు. తాను పని మీద విశాఖపట్నం వచ్చానని, ఈ సందర్బంగా తాను వైయస్ జగన్ దీక్షకు వచ్చి సంఘీభావం తెలిపానని ఆయన వివరించారు. వైయస్ జగన్ కు తొలి నుంచి సబ్బం హరి మద్దతు పలుకుతున్నారు. జనవరి 3వ తేదీ నుంచి విశాఖపట్నంలో చేపట్టే ఓదార్పు యాత్రకు కూడా ఆయన ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications