వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు దీక్షపై ప్రధానిని కలిసిన తెలుగుదేశం, వామపక్ష నేతలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Telugudesam
న్యూఢిల్లీ‌: రైతు సమస్యలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న నిరవధిక దీక్షను తెలుగుదేశం, వామపక్ష నేతలు బుధవారం ప్రధాని మన్మోహన్ సింగ్ దృష్టికి తెచ్చారు. రైతు సమస్యలపై పరిష్కారానికి చంద్రబాబు 22 డిమాండ్లతో రాసిన వినతిపత్రాన్ని వారు ప్రధానికి అందించారు. చంద్రబాబు తన కోసం దీక్ష చేయడం లేదని, రైతు సమస్యల పరిష్కారానికి దీక్ష చేస్తున్నారని తాము ప్రధానికి చెప్పినట్లు సిపిఎం నేత బృందా కారత్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. రాష్ట్రంలో 137 మంది రైతులు మరణించారని, రైతులకు సరైన నష్టపరిహారం ఇచ్చి ఆదుకోకపోతే పూర్తిగా అత్మవిశ్వాసం కోల్పోతారని ఆమె అన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 400 కోట్ల అడ్వాన్స్ నిధులు ఏ మాత్రమ సరిపోవని ఆమె అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని సిపిఐ నేత ఎబి బర్దన్ అన్నారు. ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నది ముఖ్యం కాదని, నష్టపరిహారం ఎంత ఇస్తారన్నదే ముఖ్యమని ఆయన అన్నారు. రైతుల సమస్య రాజకీయపరమైన అంశం కాదని బృందా కారత్ అన్నారు. గతంలో రాష్ట్ర రైతులకు వేయి కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటించి కేంద్రం 520 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిందని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X