కిరణ్ కుమార్ రెడ్డి పర్యటనకు నలుగురు ఎమ్మెల్యేలు దూరం
ముఖ్యమంత్రి వెంగమాంబ సమాధిని దర్సించి, జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఈ రెండు కార్యక్రమాలను ఆయన రద్దు చేసుకున్నారు. జిల్లా సమీక్ష సమావేశానికి షాజహాన్, కుతూహలమ్మ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితో పాటు మరో ఎమ్మెల్యే గైర్హాజరైతే మిగతా జిల్లాల్లో దీని ప్రభావం పడుతుందని ఆయన భావించినట్లు తెలిసింది. దీంతో జిల్లా సమీక్షా సమావేశాన్ని రద్దు చేసుకున్నట్లు చెబుతున్నారు. శనివారం ఉదయం ఆయన పద్మావతి అతిథి గృహంలో పార్టీ సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్టీని పటిష్టం చేయాలని ఆయన నాయకులను కోరారు.
Comments
Story first published: Saturday, December 25, 2010, 10:39 [IST]