చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిరణ్ కుమార్ రెడ్డి పర్యటనకు నలుగురు ఎమ్మెల్యేలు దూరం

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
తిరుపతి‌: సొంత జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటనకు అన్నీ ఆటంకాలే ఎదురవుతున్నాయి. శుక్రవారం సాయంత్రం తిరుపతికి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డికి వైయస్ జగన్ వర్గీయుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఆయన పర్యటనకు నలుగురు కాంగ్రెసు శాసనసభ్యులు దూరంగా ఉన్నారు. తిరుమలలో భక్తులు ఆందోళనకు దిగారు. ఈ స్థితిలో తిరుపతిలో ముఖ్యమంత్రి తన కార్యక్రమాలను చాలా వరకు రద్దు చేసుకున్నారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన కార్యకర్తలు ముఖ్యమంత్రి కాన్వాయ్ ని అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

ముఖ్యమంత్రి వెంగమాంబ సమాధిని దర్సించి, జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఈ రెండు కార్యక్రమాలను ఆయన రద్దు చేసుకున్నారు. జిల్లా సమీక్ష సమావేశానికి షాజహాన్, కుతూహలమ్మ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితో పాటు మరో ఎమ్మెల్యే గైర్హాజరైతే మిగతా జిల్లాల్లో దీని ప్రభావం పడుతుందని ఆయన భావించినట్లు తెలిసింది. దీంతో జిల్లా సమీక్షా సమావేశాన్ని రద్దు చేసుకున్నట్లు చెబుతున్నారు. శనివారం ఉదయం ఆయన పద్మావతి అతిథి గృహంలో పార్టీ సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్టీని పటిష్టం చేయాలని ఆయన నాయకులను కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X