వైయస్ జగన్ నోట ఎన్టీఆర్ మాట: చంద్రబాబుపై ధ్వజం

YS Jagan
అనంతపురం: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ నోట స్వర్గీయ ఎన్టీ రామారావు పేరు వినిపించింది. చేనేత కార్మికులను స్వర్గీయ ఎన్టీ రామారావు ఆదుకున్నారని, ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు వారి నడ్డి విరిచారని ఆయన అన్నారు. ఎన్టీఆర్ తర్వాత చేనేత కార్మికులను ఆదుకున్నది వైయస్ రాజశేఖర రెడ్డి మాత్రమేనని ఆయన అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో 14 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న చేనేత కార్మికులకు ఆయన సంఘీభావం తెలిపి ప్రసంగించారు. ఈ సభకు పెద్ద యెత్తున ప్రజలు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు.

చేనేత కార్మికులు నిరాహార దీక్ష చేస్తుంటే తమకు తెలియదని ప్రభుత్వం అంటోందని, ప్రభుత్వం నిద్రపోతోందా అని అడుగుతున్నానని ఆయన అన్నారు. చేనేత కార్మికుల ఆకలి కేకలు వినాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు, చేనేత కార్మికుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలేసి నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. చేనేత కార్మికులు ఆకలి కేకలతో అలమటిస్తుంటే ప్రభుత్వం కళ్లు తెరవడం లేదని ఆయన అన్నారు. చేనేత కార్మికుల కోసం వైయస్సార్ ప్రకటించిన ప్యాకేజీ ఏమైందని ఆయన అడిగారు. చేనేత కార్మికుల కోసం పావలా వడ్డీకే లక్ష రూపాయల రుణం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నూలు ధరలు పెరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+