హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసు నాయకుల దీక్షకు దిగి వచ్చిన కాంగ్రెసు హైకమాండ్?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
హైదరాబాద్: ఉద్యమాలలో పాల్గొన్న విద్యార్థులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు చేసిన దీక్షకు కాంగ్రెసు అధిష్టానం దిగి వచ్చింది. వెంటనే అధిష్టానం హోంమంత్రి సబితారెడ్డికి ఫోన్ చేశారు. రాష్ట్ర ఇంఛార్జ్ కృష్ణమూర్తి సబితకు ఫోన్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హోంమంత్రితో మాట్లాడారు. కేసులు ఎత్తివేసే విషయంపై హోమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సమావేశం అనంతరం హోంమంత్రి కేసుల ఎత్తివేతపై స్పష్టం చేయనున్నారు.

కేంద్ర హోంమంత్రి కేసులు ఎత్తివేయమని స్పష్టంగా చెప్పినప్పటికీ కేసులు ఎత్తివేయకపోవటంపై అధిష్టానం ముఖ్యమంత్రిపై సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. కేసులు వెంటనే ఎత్తివేయాలని అధిష్టానం చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే స్వయంగా సొంత పార్టీవారే డిమాండ్ చేసినప్పటికీ సమీక్షా సమావేశం అనంతరం హోంమంత్రి సబితారెడ్డి అసెంబ్లీలో విపక్షాల సమక్షంలో చెప్పిన విషయాన్నే చెబితే మాత్రం ఫలితం ఉండదంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X