హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసు గన్ పార్కు దీక్షలోని వ్యూహమేంటి: పయ్యావుల కేశవ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Payyavula Keshav
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ కోసం, ఉద్యమాలు చేసిన విద్యార్థులపై కేసులు ఎత్తివేయడంపై కాంగ్రెసు నేతలు ఢిల్లీలో ఉద్యమించాల్సింది పోయి తెలంగాణ అమరవీరుల స్థూపం అయిన గన్ పార్కు వద్ద చేయడంలోని వ్యూహమేమిటని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ సోమవారం కాంగ్రెసు నేతలను ప్రశ్నించారు. వారు హైదరాబాదులో ధర్నా చేస్తే ఫలితం లేదన్నారు. ఢిల్లీ వెళ్లి పోరాడాలని సూచించారు.

వ్యవసాయానికి కాంగ్రెసు పార్టీకన్నా తెలుగుదేశం పార్టీయే ఎక్కువ చేసిందని చెప్పారు. వ్యవసాయానికి నిధులు ఖర్చు చేయటంలో కాంగ్రెసు ప్రభుత్వం కన్నా తెదేపా ప్రభుత్వమే ముందున్నదన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యవసాయం దండుగ అని ఎప్పుడు అన్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు అనని మాటలను ఆయనకు ఆపాదిస్తున్నారన్నారు. వ్యవసాయానికి, రైతులకు తెదేపా ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X