హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దీక్ష విరమించండి: కాంగ్రెసు ఎంపీలకు తెలంగాణ మంత్రుల వినతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana Ministers
హైదరాబాద్: కేసుల ఎత్తివేత పట్ల ఉదారంగా వ్యవహరించడానికి ముందుకు వచ్చినందున దీక్ష విరమించాలని తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు కె. జానా రెడ్డి, శ్రీధర్ బాబు, బసవరాజు సారయ్య కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. మరో 135 కేసులను ఎత్తివేయడానికి ముఖ్యమంత్రి అంగీకరించారని, మిగతా కేసుల ఎత్తివేతకు ఉదారంగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారని వారు సోమవారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో చెప్పారు.

మిగతా కేసులను సత్వరమే పరిష్కరిస్తామని వారు చెప్పారు. తెలంగాణ సాధించే వరకు పోరాటం సాగిస్తామని, తామంతా ఒకే మాట మీద ఉంటామని మంత్రి బసవరాజు సారయ్య చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్టీ అధిష్టానాన్ని ఒప్పిస్తామని, అలా ఒప్పించాలని బాధ్యత అందరి మీదా ఉందని ఆయన చెప్పారు.

కాగా, హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పార్లమెంటు సభ్యుడు కె. కేశవరావుకు ఫోన్ చేసి దీక్ష విరమించాలని కోరారు. 135 కేసులు ఎత్తివేస్తున్నామని ఆమె చెప్పారు. అయితే, మొత్తం కేసులు ఎత్తేసేవరకు దీక్ష విరమించేది లేదని కేశవ రావు హోం మంత్రితో చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X