నేతలతో భేటీలతో వైయస్ జగన్ బిజీ: ప్రభావం ఉంటుందన్న పెన్మెత్స

పదిరోజుల్లోనే జిల్లాలో జగన్ కు అనుకూలంగా భారీ మార్పులు వచ్చాయని, రానున్న రోజుల్లో మరిన్ని మార్పులు వస్తాయని ఆయన చెప్పారు. జగన్ ను ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు. జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణరావుకు రాజకీయంగా నూకలు చెల్లినట్టేనని చెప్పారు. జగన్ వెంట నడవడానికి జిల్లాలో పెక్కుమంది సిద్ధంగా ఉన్నారన్నారు. కాగా జగన్ ను తెలుగుదేశం పార్టీ అసమ్మతి శాసనసభ్యులు బాలనాగిరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కాంగ్రెస్ జగన్ వర్గం శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, గురునాథ్ రెడ్డి, సినీ నటుడు విజయ్ చందర్ తదితరులు కలిశారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ నియోజకవర్గానికి చెందిన 15మంది శాసనసభ్యులు జగన్ ను కలిశారు. తమ శాసనసభ్యులు కూడా మీ వెంటే వస్తారని జగన్ కు చెప్పారు.












Click it and Unblock the Notifications