తెలంగాణ ప్రజల అభీష్టం మేరకే కేంద్రం నిర్ణయం:డి. శ్రీనివాస్

అయోమయం సృష్టించే వారి ఎత్తుగడల వలలో పడకుండా కాంగ్రెస్ను కాపాడుకునే బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందని డీఎస్ తర్వాత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సంక్లిష్ట పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తలపై బృహత్తర బాధ్యత ఉందన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో క్రియాశీల పాత్రను బాధ్యతతో నిర్వర్తిస్తూ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు వారు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు పార్టీ 126వ వ్యవస్థాపక దినోత్సవం, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఈ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల ప్లీనరీలో నిర్ణయించిన మేరకు విధివిధానాలు అందిన వెంటనే రాష్ట్ర, జిల్లా, బ్లాకు, మండల స్థాయుల్లో కార్యకర్తల భాగస్వామ్యం ఉండేలా పరిశీలన కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications