వైయస్ జగన్, తెలంగాణలపై మంత్రులకు సిఎం కిరణ్ కుమార్ క్లాస్

కాగా, వైయస్ జగన్ చేస్తున్న విమర్శలను ముఖ్యమంత్రి ప్రధానంగా ప్రస్తావనకు తెచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం చేపట్టిన ప్రతి పనినీ జగన్ తప్పు పడుతున్నారని, ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన చెబుతూ వైయస్ జగన్ విమర్శలను మంత్రులు సమర్థంగా తిప్పికొట్టాలని, తగిన విధంగా జగన్ విమర్శలకు సమాధానం ఇవ్వాలని ఆయన సూచించారు. వైయస్ జగన్ పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శించకూడదని, అధిష్టానం కూడా అదే విషయం చెప్పిందని మంత్రి వట్టి వసంతకుమార్ అన్నట్లు సమాచారం. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చుననే విషయాన్ని మంత్రి ధర్మాన ప్రసాదరావు పరోక్షంగా ప్రస్తావనకు తెచ్చారు. మనం సరిగా వ్యవహరించకపోతే పాలన మన చేతి నుంచి పోయే ప్రమాదం ఉందని ఆయన చెప్పినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications