హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణకోసం అన్ని పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి: కోదండరామ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: జనవరి 6న కేంద్ర హోంమంత్రి చిదంబరం ఏర్పాటు చేసే అఖిలపక్ష భేటేలో రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీలు తెలంగాణకోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ శుక్రవారం కోరారు. తెలంగాణకోసం ఏ పార్టీ ఒత్తిడి తీసుకు రాకపోయినా తెలంగాణలో వారిని తిరగనివ్వమని హెచ్చరించారు. తెలంగాణ సాధన కోసం శుక్రవారం నుండి జనవరి 5వ తేది వరకు కొవ్వత్తుల ప్రదర్శన తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించాలని ఆయన సూచించారు.

జనవరి 6వ తేదిన కేంద్ర ప్రభుత్వం వైఖరి తెలంగాణపై స్పష్టమవుతుందన్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర సమితి, మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలుస్తుందనే వార్తలలో ఎలాంటి నిజం లేదని మాజీ పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ అన్నారు. మా ముందు ఉన్న ఏకైక లక్ష్యం తెలంగాణే అని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X