హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మా ఫోరం తెలంగాణకు కట్టుబడి ఉంది: నాగం జనార్ధ్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి శుక్రవారం అన్నారు. తెలంగాణ ఫోరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి కట్టుబడి ఉంది అని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ నివేదిక తెలంగాణకు అనుకూలంగా లేకపోతే తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పోరాటానికి సిద్ధమవుతామని స్పష్టం చేశారు.

తెలంగాణ కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని నాగం ప్రకటించారు. కేంద్ర బలగాలను మోహరించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. వెంటనే రాష్ట్రంలోని కేంద్ర బలగాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జనవరి 7వ తేదిన తెలంగాణపై పార్టీ మరోసారి సమావేశమై భవిష్యత్తు ప్రణాళికను నిర్ణయించుకుంటామన్నారు. హోంమంత్రి చిదంబరం జనవరి 6న ఏర్పాటు చేసిన అఖిలపక్షానికి హాజరవుతామని చెప్పారు. వచ్చే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X