హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తుది దశలో తెలంగాణ ఉద్యమం: తెరాస అధినేత కె చంద్రశేఖర రావు

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం తుది దశలో ఉందని, కలిసికట్టుగా పోరాడి రాష్ట్రాని సాధించుకోవాల్సి ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. తెలంగాణ కాలేజీల స్టాఫ్ అసోసియేషన్ సమావేశంలో ఆయన సోమవారం ప్రసంగించారు. ఈనాడు తెలంగాణ ఎడ్డిది, గుడ్డిది కాదని, తెలంగాణ యావత్తు ఏకమైందని, రాష్ట్రాన్ని సాధించుకునే వరకు పోరాడుతుందని ఆయన అన్నారు. 54 ఏళ్ల పోరాటంలో కేంద్ర ప్రభుత్వం మొదటిసారి కదిలి వచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిందని ఆయన చెప్పారు. చాట్ల తౌడు పోసి కొట్లాట పెట్టినట్లు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

ఉద్యోగులందరినీ ప్రభుత్వం కాంట్రాక్టు ప్రాతిపదికపైన నియమిస్తోందని, ముఖ్యమంత్రినీ మంత్రులనూ కాంట్రాక్టు పద్ధతిపై నియమిస్తే బాగుంటుందని ఆయన అన్నారు. హైదరాబాదులో తెలంగాణకు చెందిన ఒక్క కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ కూడా లేడని, ఆదాయం మనది - అధికారం ఆంధ్రోళ్లదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే జిల్లాకు పది వేల ఉద్యోగాలు వస్తాయని, మొత్తం లక్ష ఉద్యోగాలు వస్తాయని ఆయన చెప్పారు. ఉద్యోగులందరూ తెలంగాణ సాధన కోసం తట్టాపారా కింద పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X