నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపి నుంచి తప్పుకుంటా, తెరాసలో చేరుతా: పోచారం శ్రీనివాస రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Pocharam Srinivas Reddy
నిజామాబాద్: తన నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, ప్రజల అభీష్టం మేరకు తాను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరుతానని తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ జిల్లా బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస రెడ్డి చెప్పారు. తాను హైదరాబాద్ వచ్చిన తర్వాత అధికారికంగా ప్రకటన చేస్తానని ఆయన సోమవారం చెప్పారు. తన నియోజకవర్గంలోని ప్రజలు, కార్యకర్తలు, నాయకుల అభిప్రాయం తేసుకోవడానికి బాన్సువాడ వచ్చానని ఆయన చెప్పారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరితో తెరాస ముందుకు సాగుతోందని, అందువల్ల తెరాసతో కలిసి పనిచేద్దామని ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అంటున్నారని, వారి అభిప్రాయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

తెరాస నాయకులు వారం రోజుల నుంచి ఫోన్లు చేస్తున్నారని, తాను వారికి ఏమీ చెప్పలేదని, ఈ స్థితిలో నియోజకవర్గంలో అభిప్రాయం తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలంగా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి నివేదిక ఇచ్చామని, తెరాసతో పొత్తు పెట్టుకున్నామని, ఇప్పుడు తెలంగాణ కోసం తెలుగుదేశంలో ఉండి పోరాటం చేయలేని స్థితి ఉందని, ఈ విషయాన్ని తాను పార్టీ అధినేత చంద్రబాబుకు చెప్పానని ఆయన అన్నారు. తాము తెలుగుదేశంలో తెలంగాణపై నిస్సహాయ స్థితిలో ఉన్నామని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X