సూరి హత్య కేసు: భానుకిరణ్పై బిగుస్తున్న ఉచ్చు

మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్లోని అలేఖ్య అపార్టుమెంటునుండి మద్దెలచెర్వు సూరి, భానుకిరణ్, మధుసూదన్ రెడ్డి బయలు దేరారు. అక్కడినుండి నేరుగా సనత్నగర్ చేరుకున్నారు. అక్కడ మద్దెలచెర్వు సూరి తరఫు లాయర్లు అచ్యుతరెడ్డి, రామకృష్ణారెడ్డి ఉన్నారు. వారితో పరిటాల రవి హత్యపై చర్చించారు. అనంతరం సనత్నగర్ నుండి బంజారాహిల్స్లో ఉంటున్న సూరికి దగ్గరి స్నేహితుడు శ్రీనివాస్ రెడ్డి ఇంటికి ముగ్గురు కలిసి బయలుదేరారు. అప్పుడు కారును మధుసుదన్ డ్రైవింగ్ చేస్తుండగా, సూరి ముందు కూర్చున్నాడు. భానుకిరణ్ వెనుక సీట్లో కూర్చున్నాడు. ఎసి కారణంగా విండో పూర్తిగా మూసివేశారు.
అప్పుడు కారు గంటకు 25 కి.మీ.వేగంతో వెళుతుంది. కారు నవోదయ కాలనీకి చేరగానే ఓ పెద్ద శబ్దం వినిపించింది. మధు వెంటనే కారు స్లో చేశారు. ఆ సమయంలో భాను కారు దిగి ఏదో భారీ శబ్ధం వినిపించిందని, అటాక్ జరగిందని చెప్పి అక్కడినుండి దిగి వెళ్లిపోయాడు. ఆ సమయంలో సూరి ఏం జరిగింది అంటూ తనపై పడ్డాడు. ఆ సమయంలో సూరి తల వెనుక భాగం నుండి రక్తం కారడం మధు చూశాడు. భానుకు ఫోన్ చేస్తే తరువాత మాట్లాడుదామని చెప్పాడు. పరిస్థితిని గమనించిన మధు, సూరిని తీసుకొని వెళ్లి అపోలో ఆసుపత్రిలో చేర్పించాడు. భాను గన్మెన్ మదన్మోహన్సింగ్ చేతిలో ఓ చిన్న ఆయుధం ఉండేది. ఇది మధుసాధన్రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసుల ఎఫ్ఐఆర్లో ఉన్న సమాచారం.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications