హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జనవరి 6న తేదీన కెసిఆర్ ధర్నా, కేంద్రంపై పెంచుతున్న ఒత్తిడి

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై కేంద్రం మీద తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మరింత ఒత్తిడి పెంచుతున్నారు. ఈ నెల 6వ తేదీన హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద ఆయన ధర్నాకు దిగుతున్నారు. తెలంగాణ జెఎసి ఏర్పాటు చేస్తున్న ధర్నాలో ఆయన రోజంతా పాల్గొంటున్నారు. అదే రోజు శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం రాష్ట్రానికి చెందిన అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సమావేశాన్ని బహిష్కరించాలని తెరాస నిర్ణయించుకున్న నేపథ్యంలో కెసిఆర్ ధర్నాకు దిగుతున్నారు.

ఈ నెల 6వ తేదీన జరిగే అఖిల పక్ష సమావేశానికి పార్టీకి ఒక్కరేసి ప్రతినిధిని మాత్రమే ఆహ్వానించాలని కోరుతూ ఆయన ఇంతకు ముందుకు చిదంబరానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. పార్టీకి ఇద్దరేసి ప్రతినిధులను ఆహ్వానిస్తే తాము సమావేశాన్ని బహిష్కరిస్తామని ఆయన చెప్పారు. కాగా, 6వ తేదీ సమావేశం నేపథ్యంలో కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులతో పార్టీ అధిష్టానం పెద్దలు రేపు బుధవారం సమావేశమవుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X