హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హత్యా రాజకీయాలు వద్దు: సూరి హత్యను ఖండించిన మంత్రి రఘువీరా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Raghuveera Reddy
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి రఘువీరారెడ్డి మంగళవారం విచారణ వ్యక్తం చేశారు. సోమవారం తన ముఖ్య అనుచరుడు భానుకిరణ్ కాల్పులలో మరణించిన సూరిని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడే సూరికి సుమారు 42 నిమిషాలు పోస్టు మార్టం చేశారు. మంత్రి రఘువీరారెడ్డి ఉస్మానియా ఆసుపత్రిలోని సూరి మృతదేహానికి నివాళులు అర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడారు. సూరి హత్యను ఖండిస్తున్నట్టు చెప్పారు. హత్యా రాజకీయాలకు తాను పూర్తి వ్యతిరేకినని ప్రకటించారు. ఫ్యాక్షనిజాన్ని ఎవరూ హర్షించరన్నారు. అందరూ హత్యా రాజకీయాలకు స్వస్తీ పలకాలని చెప్పారు. అనంతపురం ప్రజలు సంయమనం పాటించాలని ఆయన కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X