విభజనపై తదుపరి సమావేశం నాటికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం

రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలనే శ్రీకృష్ణ కమిటీ నివేదిక సిఫార్సు తమకు సమ్మతమని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు సి. రామచంద్రయ్య అన్నారు. నివేదిక పూర్తిగా చదివిన తర్వాత తమ అభిప్రాయం చెబుతామని ఆయన అన్నారు. నివేదిక పూర్తిగా చదివిన తర్వాత తన అభిప్రాయం వెల్లడిస్తానని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు అన్నారు. పది నెలల పాటు శ్రీకృష్ణ కమిటీ విశేష శ్రమ చేసి నివేదిక సమర్పించిందని ఆయన చెప్పారు. ఈ నెలలోనే పార్టీలు తమ అభిప్రాయం చెప్పాలని చిదంబరం కోరినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తాను చిదంబరాన్ని కోరినట్లు కాంగ్రెసు శాసనసభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications