హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకృష్ణ కమిటీ నివేదికకు, లాఠీచార్జ్‌ కు నిరసనగా తెలంగాణ బంద్‌

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: తెలంగాణ అంశంపై కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీ నివేదికను, గురువారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్‌కు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి పిలుపునిచ్చింది. తెలంగాణ జెఏసి పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు స్వచ్చంధంగా బంద్ పాటిస్తున్నాయి. నివేదికను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరపడాన్ని తెలంగాణ జెఏసి తీవ్రంగా ఖండించింది.

తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి కూడా శుక్రవారం లంచ్ అవర్‌లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. అందరు ప్రభుత్వ ఉద్యోగులు భోజన విరామ సమయంలో శ్రీకృష్ణ కమిటీ నివేదికను, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై దాడికి నిరసనగా ఆందోళన చేపట్టనున్నారు. తెలంగాణ జెఏసి ఇచ్చిన బంద్ పిలుపుకు తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ తెలుగుదేశం ఫోరం మద్దతు తెలిపాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X