హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దీక్ష కోసం ఢిల్లీ వెళ్లిన వైయస్ జగన్: 24 బోగీలతో బయలుదేరిన ప్రత్యేక రైలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: కృష్ణా ట్రిబ్యునల్‌లో అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లడానికి మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఈనెల 11న న్యూఢిల్లీలో చేయనున్న ఒక్కరోజు దీక్షకు ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ప్రత్యేక రైలులో బయలుదేరారు. ఆయనతో పాటు సుమారు 1500 మంది రైతులు, పలువురు ప్రజాప్రతినిధులు బయలు దేరారు. జగన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలులో 24 బోగీలు ఉన్నాయి.

జగన్ వెంట పలువురు ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లారు. మాగుంట శ్రీనివాస్‌రెడ్డి, అమరనాథ్‌రెడ్డి, రేగా కాంతారావు, కుంజా సత్యవతి, శివప్రసాద్‌రెడ్డి తదితర ఎమ్మెల్యేలు వెంట వెళ్లారు. కాగా 1.30 గంటలకు బయలుదేరవలసిన జగన్ రెండు గంటలు ఆలస్యంగా ఢిల్లీ బయలుదేరారు. జగన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరగానే భారీ ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. మాచర్ల ఎమ్మెల్యే సోదరులు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, మదన్‌మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రెహమాన్,సినీనటుడు విజయ్‌చందర్ తదితరులు జగన్‌ను కలిశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X