వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖపట్నం జిల్లా రోడ్డు ప్రమాదంలో పది మంది దుర్మరణం

By Pratap
|
Google Oneindia TeluguNews

Vishakapatnam
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని పాయకరావుపేట మండలం నామవరం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని వ్యాన్‌ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పరవాడ నుంచి తూర్పుగోదావరి జిల్లా మండపేట వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

మృతులను తూర్పుగోదావరి జిల్లా మండపేట వాసులుగా గుర్తించారు. ప్రమాదంలో గాయపడినవారిని తుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు మత్స్యకారులని తెలుస్తోంది. సముద్రంలో వేటకు వెళ్లి తిరిగి వస్తుండగా వారు ఈ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X