హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిఎస్‌ పై భగ్గుమంటున్న తెలంగాణ నేతలు, మొయిలీ మాట ఉత్తదే

By Pratap
|
Google Oneindia TeluguNews

D Srinivas
హైదరాబాద్: కాంగ్రెసు తెలంగాణ నాయకులు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌పై భగ్గుమంటున్నారు. తాము మంగళవారం సాయంత్రం తలపెట్టిన సమావేశాన్ని అడ్డుకునేందుకు డిఎస్ ప్రయత్నిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. డిఎస్ ‌పై అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమావేశం మానుకోవాలని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ తమకు ఫోన్ చేశారని వచ్చిన వార్తలను కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు కొట్టిపారేశారు. తమకు మొయిలీ నుంచి ఏ విధమైన ఆదేశాలు రాలేదని వారు స్పష్టం చేస్తున్నారు.

సమావేశం కూడా పెట్టుకోలేకపోతే ఏ మొహం పెట్టుకుని తాము ప్రజల్లోకి వెళ్తామని వారు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణపై సమావేశాన్ని కూడా అనుమతించరా అని వారు గుర్రుమంటున్నారు. డిఎస్ తమ సమావేశాన్ని రద్దు చేయించడానికి ప్రయత్నిస్తున్నారని వారంటున్నారు. అధిష్టానానికి చెప్పి తమ సమావేశాన్ని అడ్డుకునేందుకు కిరణ్ కుమార్ రెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X