విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నూటికి రెండొందలు వైయస్ జగన్ మనిషినే: ఎమ్మెల్యే ద్వారంపూడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Dwarampudi Chandrasekhar Reddy
హైదరాబాద్: తాను నూటికి రెండొందల వంతులు మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి వెంటే ఉంటానని కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి బుధవారం స్పష్టం చేశారు. తాను అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. అందులో ఎలాంటి సందేహం లేదని ప్రకటించారు. నేను ఖచ్చితమైన నిర్ణయంతో ఉన్నానని చెప్పారు.

జగన్ పార్టీ పెడితే అందులో చేరతానని చెప్పారు. జగన్‌కు ఎమ్మెల్యేల మద్దతుతో పాటు రాష్ట్ర ప్రజల మద్దతు ఉందన్నారు. గత డిసెంబర్‌లో వైయస్ జగన్ విజయవాడలో చేపట్టిన దీక్షలో తాను పాల్గొనక పోయేసరికి తాను జగన్ వెంట ఉండననే వార్తలు వచ్చాయన్నారు. అయితే తనకు అప్పుడు అత్యవసర సమావేశం ఉన్నందువల్లే జగన్ దీక్షకు వెళ్లలేక పోయానని చెప్పారు. జగన్‌కోసం రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X