హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ మౌనంగా లేరు, కేంద్రానికి సమయం ఇచ్చారు: మాజీ ఎంపీ వినోద్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vinod Kumar
హైదరాబాద్: తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదిక అనంతరం తమ పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు మౌనంగా ఉన్నారన్న వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు వినోద్‌కుమార్ ఖండించారు. కెసిఆర్ మౌనంగా లేరని ఆయన బుధవారం అన్నారు. కేంద్రానికి సమయం ఇచ్చారని చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికకు ముందే కెసిఆర్ కేంద్రానికి నివేదిక సమర్పించిన తర్వాత కాస్త సమయం ఇస్తానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రస్తుతం మైనారిటీలో పడిపోయిందన్నారు. ఆ విషయం తెలిసీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అవిశ్వాస తీర్మానం పెట్టమని ఎందుకు అడగటం లేదని ప్రశ్నించారు. తన పార్టీ ఇమేజ్ పడిపోవటంతోనే ఆయన ఆ ధైర్యం చేయలేక పోతున్నారన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ అసలే లేదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X