తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా ఆందోళన: ప్రత్యేక రాయలసీమకు డిమాండ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
తిరుపతి: రాయలసీమలో సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన సంఘటన చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా తిరుపతిలో సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా, రాయల తెలంగాణకు వ్యతిరేకంగా కొందరు ఆందోళన చేపట్టారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. రాయలసీమను తెలంగాణలో కలపాలని కమిటీ నివేదిక ఇవ్వడంపట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కావాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ కంటే పూర్తిగా రాయలసీమ వెనుకబడిందని చెప్పారు. నివేదికలో కూడా ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పారని అన్నారు. అయితే రాయలసీమను తెలంగాణలో కలపడానికి తాము ఒప్పుకునేది లేదని, రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మేం తెలంగాణతో గానీ, మరో ప్రాంతంతోగానీ కలిసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే బాగా వెనుకపడిదంని, తెలంగాణతో కలిపితే అభివృద్ధి చెందమని, తమకు ప్రత్యేక రాయలసీమ కావాలని వారు డిమాండ్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X