తెలంగాణ సమస్య పరిష్కారమయ్యే వరకు సిఎంగా కిరణ్: శంకరరావు
దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి, వైయస్ జగన్ అవినీతిని నిరూపించడానికి గంట వ్యవధి చాలునని ఆయన అన్నారు. వైయస్ జగన్ అవినీతిని ఎప్పుడైనా నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. వైయస్ జగన్ అవినీతిని నిరూపించలేకపోతే తన ఆస్తులను ప్రజలకు ఇచ్చేస్తానని ఆయన సవాల్ చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి కన్నా ఒక మెట్టు పైన వైయస్ జగన్ ఉండాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వైయస్ జగన్ను వెంటేసుకుని రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు.
Comments
Story first published: Friday, January 14, 2011, 14:51 [IST]