తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ సమస్య పరిష్కారమయ్యే వరకు సిఎంగా కిరణ్: శంకరరావు

By Pratap
|
Google Oneindia TeluguNews

Shankar Rao
తిరుపతి‌: తెలంగాణ ప్రక్రియ పూర్తియ్యే వరకు ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి కొనసాగుతారని రాష్ట్ర చేనేత శాఖ మంత్రి పి. శంకరరావు అన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎన్నికపై తమ కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. 2012లో తెలంగాణ రాష్ట్ర ఏర్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వైయస్ జగన్‌పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి, వైయస్ జగన్ అవినీతిని నిరూపించడానికి గంట వ్యవధి చాలునని ఆయన అన్నారు. వైయస్ జగన్ అవినీతిని ఎప్పుడైనా నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. వైయస్ జగన్ అవినీతిని నిరూపించలేకపోతే తన ఆస్తులను ప్రజలకు ఇచ్చేస్తానని ఆయన సవాల్ చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి కన్నా ఒక మెట్టు పైన వైయస్ జగన్ ఉండాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వైయస్ జగన్‌ను వెంటేసుకుని రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X