మద్దెలచెర్వు సూరి హత్య వెనక వైయస్ జగన్ పాత్ర: తెలుగుదేశం

సూరి హత్య కేసులో బాబును తెరమీదకు తేవడంలో ప్రేరేపించిందెవరని భానుమతిని వారు ప్రశ్నించారు. 'బినామీల పేర్ల పై సూరి పెట్టిన ఆస్తులన్నింటినీ మళ్లీ ఇస్తామన్నందుకే బాబుపై బురద చల్లేందుకు యత్నించారా?' అని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య భానుమతిని ప్రశ్నించారు. హైదరాబాద్తో పాటు కృష్ణా, అనంతపురం జిల్లాల టీడీపీ కార్యాలయాల్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశాల్లో నేతలు సూరి హత్యలో జగన్ పాత్ర ఉందని ఆరోపించారు.
కాంగ్రెస్ పెద్దలు సూరి కేసుపై ఆసక్తి చూపించడం లేదని, సీబీఐని ఆశ్రయిస్తానని చెప్పిన భానుమతి, ఇవాళ బాబును ముగ్గులోకి లాగుతున్నారని రామయ్య ఆరోపించారు. హత్య వెనుక జగన్ హస్తం ఉందని కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. భానుమతి చేత చంద్రబాబుపై ఆరోపణలు చేయిస్తున్నది కూడా జగనేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు, అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి ఆరోపించారు.
పరిటాల రవి హత్య మొదలునేడు సూరి వరకు తన హత్యా రాజకీయాల బండారం బయట పడుతుందన్న భయంతో అడ్డుగా ఉన్నారని తాను భావిస్తున్న వారిని జగన్ వరుసగా హత్యలు చేయిస్తున్నాడని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. సూరి హత్యలో పరిటాల కుటుంబీకుల హస్తముందన్న భానుమతి ఆరోపణలను టీడీపీ నేతలు కాల్వ శ్రీనివాసులు, బీకే పార్థసారథి తోసిపుచ్చారు. ఆమె మతి భ్రమించి మాట్లాడుతున్నట్టు కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. సూరి హత్య జరిగిన రోజు భానుమతి చిన్నాన్న, తమ్ముడు, బంధువులు ఈ హత్యకు పరిటాల కుటుంబానికి, టీడీపీకి సంబంధం లేదన్నారని గుర్తు చేశారు.
రాజకీయాలు నేరమయం కావడాన్ని వ్యతిరేకించే మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు అని, సూరి హత్యకు ఆయన ప్రేరేపించారనడం నిరాధార ఆరోపణలు అని విజయవాడ అర్బన్ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వంశీమోహన్ పేర్కొన్నారు. వారికున్న ఆస్తుల వ్యవహారాలను పరిష్కరించుకోవడానికి ఎదుటి వారి మీద బురద చల్లడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేశారు. సూరి భార్య భానుమతి చేసిన ఆరోపణలపై వంశీ ఓ టీవీ చానెల్తో అన్నారు. 'బాబు గురించి మాట్లాడే అర్హత భానుమతికి లేదు. ఇలాంటి పిచ్చి మాటలు మానుకోవాలి. రవి కుమారుడు విదేశాల్లో చదువుకుంటున్నాడు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications