వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు రగడ
ప్రస్తుత ప్రధానిది కూడా పీవీ నరసింహరావు పాలసీయేనని, చూద్దాం చేద్దాం అంటూ కాలయాపన చేస్తుంటారని విమర్శించారు. ఏం తప్పు చేశామని పదవులివ్వలేదు? మేం కాంగ్రెస్లో లేమా? అని ప్రశ్నించారు. ఇప్పుడు తీసుకున్న వారంతా మాకన్నా సీనియర్సా? అని అడిగారు. కాంగ్రెస్ వాళ్లకు ఆంధ్రప్రదేశ్ మీదకానీ, ఎంపీల మీద కానీ గౌరవం లేదన్నారు. ఒకపక్క జగన్, చిరంజీవి, కేసీఆర్, చంద్రబాబు ఫ్యాక్టర్ ఉన్నప్పుడు కనీసం అయిదుగురికి మంత్రి పదవి ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. గురువారం ప్రణబ్తో జరిగే సీమాంధ్ర ఎంపీల సమావేశానికి వెళ్లాలా? వద్దా? అన్నది కూడా సమీక్షించుకుంటామని చెప్పారు. మేం ఏం చెప్పినా విననప్పుడు ఇలాంటి సమావేశాలకు వెళ్లి ఏం లాభం ఉంటుంది? అని ప్రశ్నించారు. విస్తరణలో వివక్షపై సీమాంధ్ర ఎంపీలంతా కూర్చొని సమీక్షించుకుంటామని చెప్పారు.
రాయపాటి సాంబశివ రావు కాంగ్రెసు మంత్రివర్గ విస్తరణ న్యూఢిల్లీ rayapati sambasiva rao congress cabinet reshuffle new delhi
Story first published: Thursday, January 20, 2011, 8:30 [IST]