కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎస్ జైపాల్‌రెడ్డి

S Jaipal Reddy
న్యూఢిల్లీ: ప్రస్తుత పరిస్థితుల్లో డీజిల్ ధర పెంచే ఉద్దేశం లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుశాఖ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. అలాగే చమురు ఉత్పత్తులపై కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ సుంకం తగ్గించడానికి ప్రయత్నిస్తానన్నారు. శాస్ర్తి భవన్‌లోని పెట్రోలియంశాఖ కార్యాలయంలో గురువారం ఆయన నూతన పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రపంచ మార్కెట్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరుగుతున్న దృష్ట్యా ఆర్థిక విధానంలో భాగంగా ధరలను పెంచాల్సి వచ్చిందన్నారు. పెట్రోల్ రేట్లను తరచుగా పెంచడం ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వానికి ఇష్టం ఉండదని, ఆర్థిక రంగంలో కొన్ని నిష్టూరసత్యాలను ఎదుర్కోవాల్సిన తరుణంలోనే ఈ భారం పడుతోందని వివరించారు.

పజలపై భారం మోపినప్పటికీ ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 72 వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయన్నారు. ఈ భారాన్ని ప్రభుత్వ ఆయిల్ సంస్థలు, ఆర్ధిక మంత్రిత్వశాఖ మోయాల్సి వచ్చిందన్నారు. కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడానికి మొన్నటి వరకు ఈ శాఖకు మంత్రిగా ఉన్న మురళీ దేవరా కృషి చేశారని, ఇప్పుడు తాను కూడా ఆ ప్రయత్నాల్లోనే ఉన్నానని వివరించారు. రాష్ట్రంలో రిలయన్స్‌కు గ్యాస్ కేటాయింపుల విషయాన్ని అడగగా...'ఇంకా అధ్యయనం చేయలేదు. చేసిన తర్వాత చెబుతాను" అని బదులిచ్చారు.

మన రాష్ట్రానికి వచ్చేసరికి మిగతావారికి అర్థం కాని రీతిలో కొంత పక్షపాతం చూపిస్తానని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పవర్ ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో అడగగా...'ఇంతవరకు నడుస్తున్న చాలావరకు ప్రాజెక్టులకు గ్యాస్ ఇచ్చాం. ఇక ముందు కూడా ఎంత అవకాశం ఉంటే అంత చూస్తాం. పూర్తి అధ్యయనం చేయకుండా రాష్ట్ర ప్రాజెక్టులకు హామీలు ఇవ్వను" అని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+