వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీకృష్ణ కమిటీని మేం గుర్తించం: భాజపా జాతీయ నేత వెంకయ్యనాయుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Venkaiah Naidu
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీని తమ పార్టీ గుర్తించలేదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ముప్పారపు వెంకయ్యనాయుడు శుక్రవారం వ్యాఖ్యానించారు. బిజెపి తెలంగాణకు కట్టుబడి ఉందని చెప్పారు. మంత్రివర్గ విస్తరణలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. రాష్ట్రంనుండి కాంగ్రెసు పార్టీకి అధిక సంఖ్యలో పార్లమెంటు సభ్యులను ఇచ్చినప్పటికీ యూపిఏ ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంనుండి 32మంది ఎంపీలను ఇచ్చినప్పటికీ రాష్ట్రంపట్ల నిర్లక్ష్యం చూపడం సరికాదని అన్నారు. కాంగ్రెసు పార్టీ ఆంధ్రప్రదేశ్ పై చిన్నచూపును మానుకోవాలని సూచించారు.

కర్ణాటక గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్ కాంగ్రెసు ఏజెంటులా పని చేస్తున్నారని ఆరోపించారు. ఆయన వ్యవహార శైలి ప్రభుత్వంపై వ్యతిరేకతను తెలియజేస్తుందని అన్నారు. ఆయనపై రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ను ఎంపీలు కలుస్తారని చెప్పారు. ఆయన వ్యవహార శైలిపై ఈ నెల 24న రాష్ట్రపతిని కలుస్తామని చెప్పారు. 25వ తారీఖుల రాజ్ భవన్ ముట్టడి ఉంటుందన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X